అరుదైన దృశ్యం.. పుడుతూనే పళ్లికిలిస్తూ..

అరుదైన దృశ్యం.. పుడుతూనే పళ్లికిలిస్తూ..

హారి పిడుగా.. ఇప్పుడే కదరా పుట్టింది. అప్పుడే రెండు పళ్లొచ్చాయా అని ఆనంద పడ్డానికి లేదు. అవి వుంటే వాడికే ప్రమాదం అని డాక్టర్లు చెప్పి ఆ రెండు పళ్లనీ తొలగించారు. తమిళనాడు రాష్ట్రం సేలంలోని వాడుగపట్టికి చెందిన రమేష్, విజయలక్ష్మి దంపతులకు ఈ నెల 1న మగబిడ్డ పుట్టాడు. పుడుతూనే రెండు పళ్లు నోట్లో ఉండడాన్ని గుర్తించారు డాక్టర్లు. వెంటనే వాటిని తొలగించకపోతే అవి ఊడి ఊపిరితిత్తులలోకి చేరే ప్రమాదం ఉందని చెప్పారు. తల్లి పాలు తాగేందుకు కూడా చిన్నారి ఇబ్బందిపడతాడని అన్నారు. దాంతో దంత వైద్య నిపుణులు డాక్టర్ రాజ నీలారెడ్డి బుధవారం శస్త్రచికిత్స చేసి చిన్నారి నోట్లోని రెండు పళ్లనీ తీసేశారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story