మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా

X
By - shanmukha |30 Sept 2020 9:24 AM IST
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీరోజూ ఇరవై వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. సామాన్యులతోపాటు రాజకీయ
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీరోజూ ఇరవై వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. సామాన్యులతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా వరుసగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా మరో మహారాష్ట మంత్రి కరోనా బారినపడ్డారు. మంత్రి ఉదయ్ సామంత్ కు కరోనా సోకినట్టు స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని.. ఫలితాల్లో పాజిటివ్ అని తేలిందని అన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. తాను హోం క్వారంటైన్లో ఉన్నానని తెలిపారు. ఇప్పటివరకూ 12 మంది మహారాష్ట్ర మంత్రులు కరోనా బారినపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com