Crime: బిల్ కట్టలేక డెలివరీ బాయ్ ని బలిచ్చేశాడు...

Crime: బిల్ కట్టలేక డెలివరీ బాయ్ ని బలిచ్చేశాడు...
కర్ణాటకలో దారుణం; డెలివరీ బాయ్ పై దాడి...హత్య

ఐ ఫోన్ బిల్ కట్టలేక 20ఏళ్ల యువకుడు ఓ డెలివరీ బాయ్ ను హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కర్ణాటక లోని హసన్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఫిబ్రవరీ 11న స్థానిక రైల్వే స్టేషన్ పక్కన సగం కాలిన మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు ప్రారంభించారు. మృతుడిని హేమంత్ నాయక్(23)గా గుర్తించారు. ఈ కార్ట్ ఎక్స్ ప్రెస్ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నాయక్ సెకండ్ హ్యాండ్ ఐ ఫోన్ డెలివరీ కోసం లక్ష్మీపురా లేఅవుట్ కు వెళ్లిన తరువాత కనిపించకుండా పోయాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు దర్యప్తు చేసి అరిష్ కేరే ప్రాంతానికి చెందిన హేమంత్ దత్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు డెలివరీ బాయ్ ను తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. కొద్ది రోజుల క్రితం హేమంత్ దత్ ఈ కార్ట్ లో ఐ ఫోన్ ను ఆర్డర్ చేసుకున్నాడు. ఇదే ఐ ఫోన్ ను నాయక్ డెలివరీ ఇచ్చేందుకు హేమంత్ ఇంటికి చేరుకున్నాడు. అయితే ఐఫోన్ తీసుకున్న హేమంత్, దానికి రూ.45,000లను కట్టేందుకు నిరాకరించడంతో నాయక్ అతడిని నిలదీశాడు. దీంతో నాయక్ పై హేమంత్ విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చాడు. అనంతరం అతడి మృతదేహాన్ని ఇంట్లోనే నాలుగు రోజులు ఉంచుకున్నాడు. ఎవరికీ అనుమానం రాలేదని నిర్ధారించుకున్నాక ఆ మృతదేహాన్ని గోనె సంచిలో కట్టేసి బైక్ పైన స్థానిక రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్లి తగలబెట్టేశాడు. ఈ మేరకు హేమంత్ మృతదేహాన్ని బైక్ పై తీసుకువెళ్లడం సీసీటీవీల్లో రియార్డ్ అవ్వడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story