Delhi : ప్రియురాలిని చంపి ఫ్రిడ్జ్ లో దాచి

Delhi : ప్రియురాలిని చంపి ఫ్రిడ్జ్ లో దాచి
మొబైల్ డేటా వైర్ ప్రియురాలి మెడకు బిగించి చంపేసిన సాహిల్


ప్రియురాలిని చంపి ఫ్రిడ్జిలో దాచాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. నిక్కీ యాదవ్, సాహిల్ గెహ్లట్ సహజీవనం చేస్తున్నారు. సాహిల్ ఇంట్లో అతనికి వేరే అమ్మయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం నిక్కీ యాదవ్ కు తెలిసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపానికి గురైన సాహిల్ తన మొబైల్ డేటా వైర్ తో నిక్కీ యాదవ్ మెడకు భిగించి చంపేశాడు. ఆమె శరీరాన్ని నజఫ్ గఢ్ మిత్రాన్ గ్రామ శివారులోని ధాబాలోని ఫ్రిడ్జ్ లో దాచాడు.


నిక్కీ యాదవ్ 'లివ్ ఇన్ రిలేషన్ షిప్' లో ఉందని తెలియదని ఆమె తండ్రి చెప్పారు. ఢిల్లీ పోలీసులు తనకు ఫోన్ చేసినప్పుడు మాత్రమే నిక్కీ హత్యకు గురైనట్లు తెలిసిందన్నారు. ఫిబ్రవరి 11న నిక్కీ ఫోన్ కు తాను కాల్ చేసినట్లు చెప్పారు. ఆ ఫోన్ ను సాహిల్ లిఫ్ట్ చేశాడని, నిక్కీ స్నేహితులతో కలిసి ముస్సోరి, డెహ్రడూన్ విహార యాత్రకు వెళ్లినట్లు చెప్పాడ ఆమె తండ్రి చెప్పారు. తొందరలో నిక్కీ ఫోన్ మర్చిపోయిందని, తాను కూడా యాత్రకు వెళ్లేవాడినని కాకపోతే తనకు పెళ్లి ఫిక్స్ అవడంవలన వెళ్లలేక పోయినట్లు సాహిల్ చెప్పాడని నిక్కీ తండ్రి మీడియాకు తెలిపారు.

నిక్కీ యాదవ్ ను హత్య చేసిన తరువాత కూడా సాహిల్ తనతో మాట్లాడాడని, అతనో పెద్ద క్రిమినల్ అని సాహిల్ ను చంపేయాలన్నంత కోపం ఉందని నిక్కీ తండ్రి మీడియా ముందు భోరుమన్నాడు. కోర్టు అతనికి ఉరిశిక్ష వేయాలని కోరుతున్నట్లు నిక్కీ తండ్రి కోరారు. నిక్కీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, హర్యానాలోని ఆమె స్వగ్రామంలో అంతక్రియలు నిర్వహించనున్నారు. సాహెల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో.. 2018లో ఉత్తమ్ నగర్ ప్రాంతంలో ఒక కోచింగ్ సెంటర్లో బాధితురాలు నిక్కీ యాదవ్ ను తాను కలిసినట్లుగా సాహిల్ పోలీసులకు తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story