ఢిల్లీ డిప్యూటీ సీఎంకు కరోనాకుతోడు డెంగీ

ఢిల్లీ డిప్యూటీ సీఎంకు కరోనాకుతోడు డెంగీ
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా సోకడంతో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా సోకడంతో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయనకు డెంగీ సోకడంతో సాకేత్ లోని మ్యాక్సు ఆస్పత్రికి తరలించారు. డెంగీకు తోడు ఆయనకు ప్లేట్ లెట్స్ బాగా డౌన్ అయ్యాయని మెరుగైన చికిత్స కోసం మ్యాక్సుకు తరలించారు. సిసోడియాకు సెప్టెంబర్ 14వ తేదిన సిసోడియాకు కరోనా అని తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే, కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అనంతరం డెంగీ సోకడంతో పాటు ప్లేట్ లెట్ల డౌన్ అవ్వడంతో మ్యాక్సు ఆసుపత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story