Gurugram: బడికి పోయిరమ్మంటే హత్య చేసి వచ్చారు...

Gurugram: బడికి పోయిరమ్మంటే హత్య చేసి వచ్చారు...
16ఏళ్ల బాలుడిని హత్యచేసిన పది మంది స్కూల్ విద్యార్ధులు, ఫరీదాాబాద్ లో విస్మయానికి గురిచేస్తున్న ఘటన...

హాయిగా ఆడుతూపాడుతూ బడికి వెళ్లి చదువుకోవాల్సిన వయసులో ఆ విద్యార్ధులు కక్షగట్టి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. 16 ఏళ్ల బాలుడిని విచక్షణారహితంగా పొడిచి పొడిచి చంపేశారు. ఈ ఘటన ఫరీదాబాద్ లోని సెక్టార్ 56లో చోటుచేసుకుంది. స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వస్తోన్న 16ఏళ్ల బాలుడు, స్కూల్ బస్సు దిగి ఫ్రెండ్ బైక్ మీద ఇంటికి వెళుతుండగా, సుమారు 10మంది స్కూల్ విద్యార్ధులు బాలుడిని స్కూటర్లు, ఇతర వాహనాలపై వెంబడించారు. అనంతరం అతడి బైక్ ను అడ్డగించారు. గట్టిగా అరుస్తూ బాలుడి కడుపులోనూ, ముఖంలోనూ, ఛాతి మీద, భుజాల మీద విచక్షణారహితంగా దాడి చేశారు. సుమారు 20సార్లు కత్తితో పొడిచారు. దాడి చేస్తుండగా 'ఇవ్వుడు అవ్వరా హీరో' అంటూ గట్టిగా అరిచారు. అనంతరం అక్కడే ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షులను నిజం చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ వెంటనే వారు అక్కడి నుంచి పారిపోయినట్లు బాలుడి తరఫు బంధువు వెల్లడించారు. మరోవైపు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు ప్రారంభించారు. అనుమానితులను గుర్తించామని, దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story