Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు హతం

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు హతం
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని సిద్రాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో.... ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు.

Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌లోని సిద్రాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో.... ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఉదంపూర్‌ జిల్లాలోని 15 కిలో ఐఈడీని పోలీసులు నిర్వీర్యం చేసిన తర్వాత ఎన్‌కౌంటర్‌ జరిగింది. సిద్రా శివారులోని ముగ్గురు టెర్రరిస్టులు.. దాక్కున్నారని అందిన సమాచారంతో... భద్రతాదళాలు కూంబింగ్‌ చేపట్టారు.


పోలీసులు, భద్రతాదళలతో కలిసి గాలిస్తుండగా... వీరిపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. దీంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడిక్కడే మరణించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో.. మందుగుండు సామాగ్రితో పాటు డిటోనేటర్లను స్వాధీనం చేస్కున్నారు. దీంతో పాటు లష్కరే తోయిబాకి చెందిన ఓ కోడెడ్‌ షీట్‌, ఓ లెటర్‌ ప్యాడ్‌ను సైతం స్వాధీనం చేసుకున్నాయి భద్రతాదళాలు.

Tags

Read MoreRead Less
Next Story