Nithyananda: నేను చనిపోలేదు.. సమాధిలో ఉన్నా: నిత్యానంద

Nithyananda: నేను చనిపోలేదు.. సమాధిలో ఉన్నా: నిత్యానంద
Nithyananda: కైలాస ప్రదేశాలు ప్రశాంతంగా ఉంటాయి. దీని గురించి ఎవరికైనా సందేహం ఉంటే తిరుమన్నామలై అరుణగిరిలోని యోగేశ్వర సమాధికి వెళ్లండి. అప్పుడు నేను వారికి అక్కడ స్పష్టంగా కనిపిస్తాను.

Nityananda: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద మళ్లీ వార్తల్లోకి వచ్చారు. కొన్ని కారణాల వల్ల నిత్యానంద చనిపోయారని ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న నిత్యానంద స్వామి ఫేస్‌బుక్ ద్వారా తనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు.

కైలాస్ అవతార్ క్లిక్స్ అనే ఫేస్‌బుక్ పేజీలో తాను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో వివరించారు. తాను సమాధిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అనారోగ్యంతో చనిపోయానని ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని భక్తులను కోరారు.

నేను ఎక్కడికీ పారిపోలేదు. నేను నా కైలాసంలో ఉన్నాను. నేను ప్రస్తుతం సమాధిలో ఉన్నానని నా భక్తులకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను వచ్చి మీతో మాట్లాడటానికి మరికొంత సమయం పడుతుంది అని ఆయన రాసుకొచ్చారు.

కైలాస ప్రదేశాలు ప్రశాంతంగా ఉంటాయి. దీని గురించి ఎవరికైనా సందేహం ఉంటే తిరుమన్నామలై అరుణగిరిలోని యోగేశ్వర సమాధికి వెళ్లండి. అప్పుడు నేను వారికి అక్కడ స్పష్టంగా కనిపిస్తాను.

ఇప్పుడు, నాకు 27 మంది వైద్యులు చికిత్స చేస్తున్నారు. అలాగే, నా సాధారణ శివపూజ మాత్రమే క్రమం తప్పకుండా జరుగుతుంది. అలాగే, మీ వ్యాఖ్యలకు నేను ఎప్పుడూ స్పందించను. కానీ నాకు ఎలాంటి అనారోగ్యమూ లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను అనారోగ్యంతో ఉన్నానని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు. నేను మీ అందరినీ నిజంగా ప్రేమిస్తున్నాను, "అని స్వామి నిత్యానంద ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.

నిత్యానంద 2019 నుండి ఈక్వెడార్ తీరంలో ఉన్న ద్వీపంలో తలదాచుకున్నారు. దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అతను పరారీలో ఉన్నారు. కైలాసాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని నిత్యానంద ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి కూడా చేశారు.



Tags

Read MoreRead Less
Next Story