KCR: దేశ రాజధానిలో కేసీఆర్ ఫ్లెక్సీలు.. రాజకీయ వర్గాల్లో చర్చ

KCR: దేశ రాజధానిలో కేసీఆర్ ఫ్లెక్సీలు.. రాజకీయ వర్గాల్లో చర్చ
KCR: ఢిల్లీలోనూ, పలు జాతీయ పత్రికల్లోనూ సీఎం కేసీఆర్‌కు సంబంధించిన ప్రకటనలు కనిపించడం ప్రాధాన్యత ఏర్పడింది.

KCR: దేశ రాజధానిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పోస్టర్లు, ఫ్లెక్సీలు హల్‌చల్ చేస్తున్నాయి. ఢిల్లీ వీధుల్లో కేసీఆర్‌ విజన్ ఆఫ్ ఇండియా అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. దీంతో దేశ రాజధానిలో సీఎం కేసీఆర్‌ పోస్టర్లపై చర్చ జరుగుతోంది.

ఇప్పటికే పలు జాతీయ పత్రికల్లోనూ మొదటి పేజీలో పెద్ద ఎత్తున ప్రకటనలు వచ్చాయి. కొత్త ఫ్రంట్‌ ఏర్పాటుకు అడుగులు పడుతుండడం, ఈ ఫ్రంట్‌లో కేసీఆరే కీలకంగా వ్యవహరిస్తానని వార్తలు రావడం, ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో ఫ్లెక్సీలు కనిపించడంతో.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ మాట్లాడుకుంటున్నారు.

జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం అవసరమైతే పార్టీ పెడతానంటూ ప్రకటించారు కేసీఆర్. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అనేక సార్లు చెప్పుకొచ్చారు కేసీఆర్. దీంతో ఇప్పటికే ధర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న మమతా బెనర్జీ.. సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారు.

అటు ఉద్ధవ్‌ థాక్రే కూడా ప్రత్యేకంగా అభినందించారు. స్టాలిన్‌ సైతం మూడో కూటమికి మద్దతు పలుకుతున్నారు. ఈ మొత్తం నేపథ్యంలో.. ఢిల్లీలోనూ, పలు జాతీయ పత్రికల్లోనూ సీఎం కేసీఆర్‌కు సంబంధించిన ప్రకటనలు కనిపించడం ప్రాధాన్యత ఏర్పడింది.

Tags

Read MoreRead Less
Next Story