Kerala : భార్యను చంపి ఇంట్లోనే పూడ్చి...

Kerala : భార్యను చంపి ఇంట్లోనే పూడ్చి...
కేరళలో కలకలం సృష్టించిన మహిళ మర్డర్ మిస్టరీ, ఏడాదిన్నర తర్వాత భర్త అరెస్ట్

భార్యతో గొడవపడి ఆమెను చంపేశాడు ఓ ప్రభుద్ధుడు. మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి... భార్య తప్పిపోయిందంటూ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కేరళ లోని ఎర్నాకుళంలో చోటుచేసుకుంది. అగస్ట్ 2021లో ఈ ఘటన జరుగగా... దాదాపు ఏడాదిన్నర తర్వాత పోలీసులు కేసును చేధించారు.

ఎర్నాకుళానికి చెందిన సంజీవ్ తన భార్యతో రమ్యతో తరచు గొడవపడేవాడు. ఒకానొక సమయంలో విచక్షణ కోల్పోయిన అతను రమ్యను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత భార్య కనిపించకుండా పోయిందని బంధువులను నమ్మించాడు. 2021 అగస్ట్ లో రమ్యను చంపేసిన సంజీవ్... 2022 ఫిబ్రవరీలో నజరక్కల్ పోలీస్ స్టేషన్ లో భార్య తప్పిపోయినట్లుగా ఫిర్యాదు చేశాడు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో సంజీవ్ పై ఒక కన్నేసి ఉంచారు పోలీసులు.

తాజాగా సంజీవ్ మరో పెళ్లికి సిద్ధమవడంతో పోలీసులు మరోసారి విచారించారు. దీంతో తన భార్యను తానే చంపి ఇంట్లోనే పాతిపెట్టినట్లుగా ఒప్పుకున్నాడు. సంజీవ్ కు రమ్యకు ఫోన్ కాల్ లో గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని... ఆ తర్వాత రమ్య శరీరాన్ని కాల్చివేసి ఇంట్లోనే పాతిపెట్టినట్లుగా పోలీసులు చెప్పారు. పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి తన భార్య ఎవరితోనో లేచిపోయినట్లుగా చెప్పాడని పోలీసులు తెలిపారు. సినీ ఫక్కీని తలపిస్తున్న ఈ ఉదంతం మనుషులు, మనస్తత్వాల్లో పెరుగుతోన్న విపరీత ధోరణికి అద్దం పడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story