Punjab: పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్‌తో ఉగ్రవాదుల దాడి

Punjab: పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్‌తో ఉగ్రవాదుల దాడి
Punjab: పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరన్ లో పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్‌తో దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Punjab: పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరన్ లో పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్‌తో దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తేలికపాటి రాకెట్‌తో ఉగ్రవాదులు దాడి చేశారని తెలిపారు. అమృత్‌సర్-భటిండా హైవేలోని సర్హాలి పోలీస్ స్టేషన్‌పై తెల్లవారుజామున దాడి జరిగిందని, భవనానికి స్వల్ప నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.



రాకెట్-లాంచర్ మొదట స్తంభాన్ని ఢీకొట్టి, ఆపై పోలీసు స్టేషన్‌ను తాకినట్లు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో తమ సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని వివరించారు. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో ఉన్న స్టేషన్‌పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర కూడా ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.


గత మే నెలలో కూడా మొహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపైనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అప్పుడు కూడా ఉగ్రవాదులు ఇలాగే తేలికపాటి రాకెట్‌తో దాడి చేశారు. అయితే, ఆ దాడిలోనూ ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని పోలీసులు చెప్పారు. పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి నేపథ్యంలో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story