Saiteja : ఇవ్వాళ బెంగళూరుకు సాయితేజ భౌతికకాయం

Saiteja : ఇవ్వాళ బెంగళూరుకు సాయితేజ భౌతికకాయం
Saiteja : హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన లాన్స్‌నాయక్ సాయితేజ భౌతిక కాయం మధ్యాహ్నం 12:30కి బెంగళూరు చేరుకోనుంది.

Saiteja : హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన లాన్స్‌నాయక్ సాయితేజ భౌతిక కాయం మధ్యాహ్నం 12:30కి బెంగళూరు చేరుకోనుంది. వైమానిక దళ విమానంలో బెంగళూరు తీసుకొచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎగువరేగడకు తీసుకొస్తారు. సాయంత్రంలోగా భౌతికకాయం స్వగ్రామం చేరుకుంటే అంత్యక్రియలు చేస్తారు. లేదంటే రేపు అంతిమ సంస్కారాలు పూర్తిచేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇంటికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

హెలికాప్టర్ ప్రమాదంలో శరీరాలు గుర్తించలేని స్థితిలో దొరకడంతో.. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా ఎవరి మృతదేహాలు ఎవరివన్నది గుర్తించారు. గురువారం రాత్రే సాయితేజ తల్లిదండ్రులు, కుమారుడి రక్తనమూనాలను బెంగళూరుకు పంపారు. డీఎన్‌ఏ పరీక్షలో సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించడంతో స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయితేజతో పాటు లాన్స్ నాయక్ వివేక్ కుమార్, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించారు.

సాయుతేజ కుటుంబీకులను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌ చేసి పరామర్శించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు తరపున కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సాయితేజ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం చేయాలని చంద్రబాబు సీఎస్‌కు లేఖ రాశారు. సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 2కోట్లు ఆర్థిక సహాయం అందించాలని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story