Omicron cases : కరోనా ఎఫెక్ట్ : 1 నుంచి 9 తరగతి విద్యార్ధులకి క్లాసులు బంద్..!

Omicron cases : కరోనా ఎఫెక్ట్ : 1 నుంచి 9 తరగతి విద్యార్ధులకి క్లాసులు బంద్..!
Omicron cases : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. భారత్ లో కూడా క్రమంగా ఈ వేరియంట్ విజృంభిస్తోంది.

Omicron cases : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. భారత్ లో కూడా క్రమంగా ఈ వేరియంట్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో, ఢిల్లీలో కేసులు వీపరితంగా పెరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు మొదలుపెట్టాయి. అందులో భాగంగానే 1 నుంచి 9 వ తరగతి విద్యార్ధులకి ఈ నెల 31 వరకు తరగతులు నిలిపివేస్తున్నట్లుగా బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సోమవారం తెలిపింది. ఇక 10-12 తరగతి విద్యార్ధులకి తరగతులు కొనసాగుతాయని చెప్పుకొచ్చింది. ఇక మహారాష్ట్రలో ఆదివారం రోజున కొత్తగా 11,877 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ముందు రోజు కంటే 2,707 ఎక్కువ, ఇక 50 ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. అటు తొమ్మిది మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 42,024 యాక్టివ్ కేసులున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story