Tamilanadu : పరిగెత్తి ప్రాణాలు కోల్పోయాడు

Tamilanadu : పరిగెత్తి ప్రాణాలు కోల్పోయాడు
మారధాన్ పూర్తి చేసిన గంట తరువాత మరణం

తమిళనాడులోని మదురైలో ఘోరం జరిగింది.మారథాన్ పరుగులో పాల్గొన్న ఓ 20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించాడు. పరుగులో పాల్గొన్న ఓ 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి గుండెపోటుతో కాసేపట్లోనే మరణించిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పి. మూర్తి జెండా ఊపి ఉతిరమ్ 2023 బ్లడ్ డొనేషన్ మారథాన్ పరుగును ప్రారంభించారు.

కల్లకురిచికి చెందిన బీటెక్ విద్యార్థి దినేశ్ కుమార్ ఈ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. అనంతరం, ఓ గంట పాటు కులాసాగానే ఉన్న యువకుడు తనకు ఒంట్లో ఏదో తెలియని ఇబ్బందిగా ఉందంటూ వాష్‌ రూంలోకి వెళ్లాడు. ఆ తరువాత బాత్రూమ్‌ లో పడి ఫిట్స్ వచ్చినట్టు గిలగిలా కొట్టుకోవడంతో స్నేహితులు అతడిని సమీపంలోని రాజాజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాధితుడికి కృత్రిమ శ్వాస, జీవనాధార వ్యవస్థపై ఉంచి చికిత్స ప్రారంభించారు. 8.45 నిముషాలకు హాస్పిటల్ కి తరలించగా, ఉదయం పది గంటల సమయంలో దినేశ్‌కు గుండెపోటు రావడంతో మరణించాడు. యువకుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దినేశ్ మధురైలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.



నిజానికి సరైన శిక్షణ లేకుండా మారథాన్ చెయ్యటం గుండెపోటు అవకాశాలను పెంచుతుంది. మారథాన్‌లో పరుగెత్తడం అనేది ఈ రోజుల్లో ఫ్యాషన్ గా మారింది. కొందరు సోషల్ మీడియా ఫ్యామ్ కోసం, మరికొందరు ఫిట్‌నెస్ కోసం రన్నింగ్ చేయాలనుకుంటున్నారు. అయితే దీనిలో లోపం ఏంటంటే, అందరూ పరిగెత్తాలని కోరుకుంటారు కానీ వారి షెడ్యూల్‌లో సరైన శిక్షణ ఉండదు. రన్నింగ్ ఎక్కువ కేలరీస్ ను ఉపయోగిస్తుంది. నడక కంటే గుండె, ఊపిరితిత్తులు, కండరాల నుండి ఎక్కువ పనితీరును కోరుతుంది. అందుకే రన్నింగ్‌కు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ అవసరం. సరైన ప్రాక్టీస్ లేకుండా ఒక్కసారిగా రన్నింగ్ చెయ్యడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ చిన్న పొరపాటు ఇలాగే గుండెపోటు రూపంలో పెద్ద దెబ్బను ఇస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story