భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
By - kasi |22 Nov 2020 5:57 AM GMT
దేశంలో గత 24 గంటల్లో 45,209 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే అంతకుముందు.. గురువారం 45,882 కేసులు నమోదు కాగా.. శుక్రవారం 46,232 కేసులు వచ్చాయి.. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 90,95,807 కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కొత్తగా కరోనా బారిన పడి 501 మంది మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కు చేరింది. అలాగే కొత్తగా 43,493 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారిసంఖ్య మొత్తం 85,21,617 గా నమోదు అయింది. ప్రస్తుతం 4,40,962 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com