Delhi Murder: ప్రియుడి మీద కోపంతో అతని కొడుకుని చంపిన ప్రియురాలు

Delhi Murder:  ప్రియుడి మీద కోపంతో అతని కొడుకుని చంపిన ప్రియురాలు
11 ఏళ్ల పిల్లాడిని గొంతు కోసి చంపిన ప్రియురాలు

కొంతకాలం తనతో సహజీవనం చేసిన ప్రియుడు తనను వదిలేసి భార్య, కొడుకు దగ్గరికి వెళ్లిపోయి వారితో కలిసి ఆనందంగా బతకడం తట్టుకోలేకపోయింది ఒక ప్రియురాలు.. గొడవ పడదామని అతని ఇంటికి వెళ్ళింది అక్కడ ఒంటరిగా ఉన్న అతని కొడుకుని చూసి, హత్య చేసి, ఏమీ తెలియనట్టు వచ్చేసింది.. దారుణమైన ఈ ఘటన ఢిల్లీలోని ఇంద్రపురిలో చోటుచేసుకుంది.

పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళ్తే, పూజా కుమారి అనే 24 ఏళ్ల యువతికి జితేందర్ అనే వివాహం అయ్యి కుమారుడు కూడా ఉన్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 2019 నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే, మూడేళ్ల తర్వాత జితేందర్ పూజను వదిలేసి తన భార్య వద్దకు వెళ్లిపోయాడు. దీంతో పూజకు వళ్ళు మండిపోయింది.. ఆవేశంతో స్నేహితులను కనుక్కొని ఆగస్ట్ 10న జితేంద్ర ఇంటికి వెళ్ళింది.

ఆమె వెళ్లే సమయానికి ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. జితేందర్ కొడుకు 11 సంవత్సరాల వయస్సున్న పిల్లాడు బెడ్ మీద పడుకుని నిద్ర పోతున్నాడు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయం గమనించిన పూజ ఇదే అదనుగా భావించిన అబ్బాయి గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత బట్టలతో పాటు అబ్బాయి డెడ్ బాడీని ఒక బాక్స్ లో పెట్టి పరారు అయ్యింది.

రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల సహకారంతో ఒక మహిళ ఆ ఇంటికి వెళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఇంద్రపురితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 300 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆమె ఆ ప్రాంతంలోనే ఉందని, అయితే తాను ఉండే ప్రదేశాలను తరచుగా మారుస్తోందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మరోవైపు ఆమె తల్లిదండ్రులను వదిలేసి చాలా కాలం అయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. చివరకు మూడు రోజుల తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story