పొలిటికల్ లీడర్స్ తో రజనీ చిట్ చాట్..

పొలిటికల్ లీడర్స్ తో రజనీ చిట్ చాట్..
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ లీడర్స్ ను కలిశారు.

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ లీడర్స్ ను కలిశారు. మరి దీని వెనుక ఆంతర్యం ఏమిటో తెలియదు కానీ రజనీ ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అనంతరం రజనీకాంత్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. తలైవర్, యాదవ్ పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆత్మీయ సంభాషణ చేసుకున్నారు.

తన రాంచీ పర్యటన తర్వాత, ఆగస్ట్ 19న రజినీకాంత్ లక్నోలో అడుగుపెట్టారు. లక్నోలోని బీజేపీ నేత నివాసానికి వెళ్లిన సమయంలో సూపర్ స్టార్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకారు. ఈరోజు ఆగస్టు 20న తలైవర్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. మైసూర్‌లో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, రజనీకాంత్ జీని తెరపై చూశాను. అప్పుడు నేను అనుభవించిన ఆనందం ఇప్పటికీ నా మనసులో చెక్కుచెదరలేదు" అని ట్వీట్ చేశారు. మేము 9 సంవత్సరాల క్రితం వ్యక్తిగతంగా కలుసుకున్నాము. అప్పటి నుండి స్నేహితులుగా ఉన్నాము. అఖిలేష్ యాదవ్‌ను కలిసిన తర్వాత రజినీకాంత్ అయోధ్యకు బయలుదేరారు.

రజనీ తాజాగా నటించిన 'జైలర్' చిత్రం సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. శనివారం లక్నోలో 'జైలర్' ను ప్రత్యేకంగా సీఎం ఆదిత్యనాథ్ డిప్యూటీ కేశవ్ ప్రసాద్ మౌర్య కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రాన్ని చూసిన అనంతరం రజనీకాంత్ అసాధారణ నటనను తాను ఆస్వాదించానని మౌర్య పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ, తలైవర్ సినిమా విజయం పైనుంచి వచ్చిన వరంలా అనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story