దేశంలో ఆశాజనకంగా ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు

దేశంలో ఆశాజనకంగా ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు

దేశంలో ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వగా కొందరిలో అస్వస్థత లక్షణాలు కనిపించాయి. దీంతో భారత్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే డ్రగ్స్‌ కంట్రోలర్స్‌ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చాక.. తిరిగి ప్రయోగాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.

పుణెలోని కింగ్ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ ఆసుపత్రి, ససాన్ జనరల్ హాస్పిటల్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ ప్రయోగాలను చేపడుతోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికే కొందరు వాలంటీర్లకు రెండో డోసు ఇచ్చారు. వారిలో కొందరికి కాస్త అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ... అవి సాధారణమేనని సీనియర్‌ వైద్యులు అంటున్నారు. మరికొందరిలో వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత జ్వరం వచ్చిందని అయితే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నారు.

క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా... గతంలో వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చినపుడు కొందరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆస్ట్రాజెనెకా ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు పూర్తిస్థాయి వివరాలు వచ్చి... అంతా సక్రమంగా జరుగుతుందని నిర్ధారణకు వచ్చాకే... మళ్లీ ట్రయల్స్‌ ప్రారంభించినట్టు... ఆస్ట్రాజెనెకా ప్రతినిధులు తెలిపారు. మనదేశంలో... కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఆస్ట్రాజెనెకాతో భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఒప్పందం చేసుకుని.. క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story