Anand Mahindra: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు
కారు భద్రతపై తప్పుడు హామీలు ఇచ్చారంటూ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్కు చెందిన 12 మంది ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైంది. ఎయిర్బ్యాగ్లు లేని స్కార్పియో కారును కంపెనీ తనకు విక్రయించిందని, తన కొడుకు ఆ కారు ప్రమాదంలో మరణించాడని ఫిర్యాదుదారు రాజేష్ మిశ్రా ఆరోపించారు. రాజేష్ మిశ్రా తన కుమారుడు అపూర్వ్కు బహుమతిగా 2020లో బ్లాక్ స్కార్పియోను రూ. 17.39 లక్షలకు కొనుగోలు చేశారు. స్కార్పియో కారులో ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోని కారణంగా తన కుమారుడు మరణించాడంటూ పోలీసులను ఆశ్రయించారు.
రాజేశ్ మిశ్రా 2020లో తన కుమారుడు అపూర్వ్కు స్కార్పియో కారు బహుమతిగా ఇచ్చారు. జనవరి 14, 2022న, స్నేహితులతో కలిసి లక్నో నుండి కాన్పూర్కు తిరిగి వస్తుండగా, పొగమంచు కారణంగా అపూర్వ్ కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ప్రమాదసమయంలో కారును డ్రైవ్ చేసిన అపూర్వ్ అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన తర్వాత, జనవరి 29న రాజేష్ తాను కారు కొన్న ఆటో స్టోర్ వద్దకు చేరుకుని, కారులోని లోపాలను ఎత్తిచూపారు. ఎఫ్ఐఆర్లో ప్రమాదం సమయంలో సీటుబెల్ట్ బిగించినప్పటికీ, ఎయిర్బ్యాగ్ అమర్చడంలో విఫలమైందని ఫిర్యాదుదారు తెలిపారు. కారు భద్రత విషయంలో కంపెనీ తనను మోసం చేసిందని వాపోయారు. సంస్థ తప్పుడు విధానాలను అవలంబించిందని పేర్కొన్నారు. అసలు కారులో ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయలేదని కూడా వెల్లడించారు. అమ్మకానికి ముందే కారును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు.కంపెనీ తప్పుడు హామీలిచ్చి మోసం చేసిందని రాజేష్ మిశ్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో షోరూం సిబ్బంది రాజేశ్తో వాగ్వాదానికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. కంపెనీ డైరెక్టర్ల ఆదేశాల మేరకు సంస్థ మేనేజర్లు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని కూడా రాజేశ్ ఆరోపించారు.
ప్రమాదం తర్వాత, స్కార్పియోను రుమాలోని మహీంద్రా కంపెనీ షోరూమ్కు తరలించారు. కంపెనీ వాహనంలో అసలు ఎయిర్బ్యాగ్లను ఏర్పాటు చేయలేదని రాజేష్ అభిప్రాయపడ్డారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 (మోసం), 287 (యంత్రాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం), 304-A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com