General Elections 2024 : మార్చి 13 తర్వాతే లోక్సభ ఎన్నికల తేదీలు ఖరారు
మార్చి 13 తర్వాత ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధతను అంచనా వేయడానికి కమిషన్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని, అది పూర్తయిన తర్వాత తేదీలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లు రానున్నారు. మార్చి 13లోపు రాష్ట్ర పర్యటనలు పూర్తి చేయాలని నిర్ణయించారు.
కమీషన్, గత కొన్ని నెలలుగా, సన్నాహాలను అంచనా వేయడానికి అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో (CEO) క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలు, ఈవీఎంల తరలింపు, భద్రతా బలగాల అవసరాలు, సరిహద్దుల్లో పటిష్ట నిఘా వంటి అంశాలను సీఈవోలు జాబితా చేశారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించాలని ఎన్నికల సంఘం యోచిస్తోందని చెప్పారు.
లోక్ సభ ఎన్నికల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మే నెలలోపు జరగనున్న లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారమ్లలో తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి, తొలగించడానికి ECIలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేక విభాగాన్ని కేటాయించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com