Pakistan: విలువైన సమాచారం విద్యార్థుల నుంచే

Pakistan: విలువైన సమాచారం విద్యార్థుల నుంచే
విద్యార్థులను వాడుకుంటున్న ఉగ్రవాద సంస్థలు

జమ్ము కశ్మీర్ లో సమాచార సేకరణకు, ఆయుధాలు, సందేశాల చేరవేతకు పాకిస్థాన్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు విద్యార్థులను విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ సహా పలువురు విద్యార్థులకు పాకిస్థాన్ నిఘా వర్గాల నుండి కాల్స్, వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయని, ప్రత్యేక సోషల్ మీడియా గ్రూపులలో చేరాలని, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని చెబుతున్నారని ఆర్మీ వర్గాలు గుర్తించినట్లుగా ప్రకటించాయి. పాకిస్థాన్ నిఘా వర్గాలకు చెందిన వ్యక్తులు ఉపాధ్యాయులుగా నటిస్తూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని చెబుతున్నాయి.

విద్యార్థులకు ముఖ్యంగా 8617321715, 9622262167 అనే రెండు మొబైల్ ఫోన్ నెంబర్ల ద్వారా పీఐఓల నుండి కాల్స్, కాల్‌లు, వాట్సాప్ సందేశాలు వస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని భారత సైనిక వర్గాలూ ధ్రువీకరించాయి. ఈ వ్యక్తులు పిల్లలకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఫోన్లు చేయడంతో పాటు వాట్సాప్ లో మెసేజ్ లు పెడుతున్నారని, వాట్సాప్ లో క్లాస్ రూంకు సంబంధించిన గ్రూపులను పేర్కొంటూ వాటిలో చేరాలని సూచిస్తున్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ముందు ఓటీపీలు పంపిస్తారు. అది ఉపయోగించి ఒక్కసారి గ్రూప్ లో చేరిన తర్వాత విద్యార్థులను వారి కుటుంబ సభ్యుల ఉద్యోగం, పాఠశాల టైమింగ్స్, ఉపాధ్యాయుల పేర్లు, యూనిఫాం మొదలైన వివరాలను అడుగుతున్నట్టుగా తెలుస్తోంది.


ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ జారీ చేసిన ఒక నివేదిక ప్రకారం పాఠశాలలు, కళాశాలలు ఉపాధ్యాయులు... ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అనుమానాస్పద కాల్స్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇవి కాక ఇతర నెంబర్ల నుంచి కూడా కాల్స్ రావచ్చని.. ఎటువంటి సమాచారన్ని పంచుకోకపోవడం తో పాటు అనుమానం వచ్చిన వెంటనే అధికారులకు గానీ, స్కూల్ యంత్రాంగానికి కానీ తెలియ జేయాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story