Rice Export: సింగపూర్ కు ఎగుమతులకు కేంద్రం ఓకే

Rice Export: సింగపూర్ కు ఎగుమతులకు కేంద్రం ఓకే
రెండు దేశాల మధ్య ప్రత్యేక బంధం నేపథ్యంలో నిర్ణయం

సింగపూర్ కి బియ్యం ఎగుమతికి భారతదేశం అనుమతించింది. నాన్ బాస్మతి రైస్ మినహా మిగతా బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. జులై 20 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. అయితే దేశీయంగా బియ్యం లభ్యత, ధరల నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

భారత్ నిర్ణయంతో విదేశాల్లో బియ్యానికి విపరీతంగా డిమాండ్ పెరిగి, చాలా దేశాల్లో కొరత ఏర్పడింది. బియ్యం కోసం జనాలు షాప్లు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో సూపర్ మార్కెట్లకు జనం పోటెత్తారు. ఒకానొక పరిస్థితిలో షాపులలో బియ్యం నిల్వలు అడుగంటాయి. దీంతో బియ్యం ఎగుమతులపై బ్యాన్ విషయంపై పునరాలోచించాలని వివిధ దేశాలు భారత్ కు విజ్ఞప్తి చేశాయి.

అయితే బియ్యం ఎగుమతులపై విధించిన బ్యాన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సింగపూర్ కు ఈ ఆంక్షలు నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు, మైత్రిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి ప్రయోజనాలతో పాటు సింగపూర్ తో ఉన్న ఆర్థిక బంధాలను గౌరవిస్తూ ఆ దేశానికి బియ్యం ఎగుమతులకు పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల చేస్తామని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.. సింగపూర్ దేశంతో ప్రత్యేక సంబంధాల దృష్ట్యా సింగపూర్ వాసుల ఆహార భద్రతా అవసరాలను తీర్చడానికి బియ్యం ఎగుమతిని అనుమతించిందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story