రామమందిరం ప్రాణ ప్రతిష్ట రోజు దీపం వెలిగించండి.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

రామమందిరం ప్రాణ ప్రతిష్ట రోజు దీపం వెలిగించండి.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
ఇంట్లో దీపాలు వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నియమానుసారంగా దీపం వెలిగిస్తేనే లాభాలుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇంట్లో దీపాలు వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నియమానుసారంగా దీపం వెలిగిస్తేనే లాభాలుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.జనవరి 22, అయోధ్యలోని రామాలయంలో రాంలాలా ప్రతిష్టాపన రోజు, దేశమంతా పండుగ రోజు. మళ్లీ దీపావళి పండుగ వచ్చిందేమో అన్నంతగా ఆ రోజు ప్రతి ఇంటా దీపాలు వెలిగించమని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి మాదిరిగానే ఇళ్లు, ఆలయాల్లో వెలుగులు నింపాలని కోరారు.

సనాతన ధర్మం ప్రకారం, పండుగలు, ప్రత్యేక సందర్భాలలో లేదా ప్రతి సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల సంతోషం, శాంతి, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రాల ప్రకారం, అగ్ని దేవుడిని ఇంట్లో దీపం వెలిగించి పూజిస్తారు. ఇంట్లో రోజూ దీపం వెలిగిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి, అయితే దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. దీనివల్ల శాంతితో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. దీని వలన భగవంతుని ఆశీర్వాదాలు కూడా కలుగుతాయి.

శాస్త్రాల ప్రకారం దీపం వెలిగించేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం..

శాస్త్రాల ప్రకారం భగవంతుని ఎడమ వైపు నెయ్యి దీపం వెలిగించి, కుడి వైపున నూనె దీపం వెలిగించాలి. దీపం పెట్టేటప్పుడు భగవంతుని సరైన దిశలో ఉంచడం ద్వారా, పూజించిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది.

దీపంలో ఉపయోగించే వత్తి దూదితో చేసి పొడవుగా ఉండాలి. పూల దీపాలను ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీపం వత్తిని పడమర లేదా దక్షిణ దిశలో ఉంచడం అశుభం.

శాస్త్రాల ప్రకారం, దీపం వెలిగించి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. ఆమె అనుగ్రహం లభిస్తుంది. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి జాస్మిన్ నూనెతో దీపారాధన చేయండి.

శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనె దీపం వెలిగించండి.

రాహు-కేతు ప్రభావాలను తొలగించడానికి, లిన్సీడ్ ఆయిల్ దీపం వెలిగించండి.

ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి దుర్గ అమ్మవారి ముందు దీపం వెలిగించండి.

దీపం వెలిగించేటప్పుడు మంత్రం జపించాలి.

'శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధన సంపద

శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతిర్ నమోస్తుతే' అనే శ్లోకాన్ని పఠించండి.

మీరు చేస్తున్న సాధన సాఫల్యం చెందాలని సంకల్పించినట్లయితే, పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి.

దీపం వెలిగించడానికి సరైన సమయం ఉదయం 5 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు.

శాస్త్రాల ప్రకారం దీపాన్ని నేలపై ఉంచరాదు. ఒక చిన్న ప్లేటులో కొద్దిగా బియ్యం పోసి దానిపై దీపం ఉంచాలి.

పూజ ప్రారంభించే ముందే దీపం వెలిగించాలి. మధ్యలో వెలిగిస్తే అది శుభప్రదంగా పరిగణించబడదు. ఈ నియమాలు పాటిస్తూ రాముని ప్రాణ పతిష్ట రోజూ అందరూ తమ ఇళ్లలో దీపాలు వెలిగించండి. ఆ రాముని కృపకు పాత్రులవుతారు అని పండితులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story