భారత్ లో మరోసారి 86 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

భారత్ లో మరోసారి 86 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్‌ కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారత్ లో మరోసారి 86 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54 లక్షల 87 వేలు..

దేశంలో కరోనా వైరస్‌ కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారత్ లో మరోసారి 86 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54 లక్షల 87 వేలు దాటింది. వీరిలో 10 లక్షల 3 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్క రోజులో 93 వేల 356 మంది రికవర్ అవగా... మొత్తం 43 లక్షల 96 వేల 399 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న ఒక్క రోజులో కరోనాతో 11 వందల 30 మంది చనిపోయారు. అటు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 87 వేల 882లకు చేరింది.

మహారాష్ట్రలో కొత్తగా మరో 20వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. 2 లక్షల 91 వేల యాక్టివ్ కేసులు ఉండగా... 8 లక్షల 84 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజులో 455 మంది చనిపోగా... మొత్తం మరణాల సంఖ్య 32 వేల 671కి చేరింది. కేసుల పరంగా సెకండ్ ప్లేస్‌లో ఉన్న ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6 లక్షల 25 వేలు దాటింది. 78 వేల పాజిటివ్ కేసులుండగా... దాదాపు ఐదున్నర లక్షల మంది కోలుకున్నారు.

మూడోస్థానంలో ఉన్న తమిళనాడులో కొత్తగా మరో ఐదున్నర వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 5 లక్షల 41 వేలు దాటగా... వీరిలో 46 వేల యాక్టివ్‌ కేసులున్నాయి. 8 వేల 811 మరణాలతో మృతుల సంఖ్యలో తమిళనాడు రెండోస్థానంలోంది. దేశంలో ఇప్పటి వరకు 6 కోట్ల 43 లక్షల 92 వేల కరోనా టెస్టులు నిర్వహించినట్టు ICMR తెలిపింది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 79.68 శాతం ఉండగా... మరణాల రేటు 1.61 శాతంగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story