అనంత్ తన ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించడంతో ముఖేష్ కన్నీళ్లు

అనంత్ తన ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించడంతో ముఖేష్ కన్నీళ్లు
అనంత్ అంబానీ తన ఆరోగ్య సమస్యల గురించి భావోద్వేగ ప్రసంగం చేయడంతో ముఖేష్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నాడు

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం గుజరాత్ లోని జామ్ నగర్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. బాలీవుడ్ తారలు, దేశంలోని ప్రముఖ వ్యక్తులు ఈ వేడుకల కోసం తరలి వెళ్లడంతో జామ్ నగర్ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనంత్ తన ఆరోగ్య సమస్యల గురించి ఉద్వేగభరితమైన ప్రసంగం చేయడంతో తండ్రి ముఖేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ తమ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షణాన్ని గడుపుతున్నారు. ప్రేమ జంట తమ వివాహానికి ముందు వేడుకలను జరుపుకుంటున్నారు. మార్చి 1, 2024న స్వాగత డిన్నర్‌తో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ అతిథుల ఆనందోత్సాహాలతో కళకళలాడుతోంది. ఈ సందర్భంగా అనంత్ కాబోయే భార్య రాధికతో కలిసి వేదికపైకి వచ్చి అతిథులతో మాట్లాడారు.

అనంత్ అంబానీ భావోద్వేగ ప్రసంగం చేశారు

అనంత్ అంబానీ అంబానీ కుటుంబంలోని అత్యంత వినయపూర్వకమైన వ్యక్తులలో ఒకరు. అతని ప్రసంగం చాలా మంది హృదయాలను గెలుచుకుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ వంటారాను నమ్మినందుకు అనంత్ తన తల్లి నీతా అంబానీకి ధన్యవాదాలు తెలిపాడు. అతను తన తల్లి ఈ వేడుకల ఏర్పాట్లకు సంబంధించి అవిశ్రాంతంగా ఎలా పనిచేసిందో వివరించాడు.

“ఇదంతా మా అమ్మ సృష్టించింది. నా తల్లి గత నాలుగు నెలలుగా అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఆమె రోజుకు 18-19 గంటలు పని చేసింది. అమ్మకు నేను చాలా కృతజ్ఞుడను. నన్ను ప్రతి క్షణం ఆనందంగా ఉంచడం కోసం అమ్మ చాలా ప్రయత్నిస్తుంది. ఆమెవల్లే ఇదంతా సాధ్యమైంది అని అనంత్ భావోద్వేగంతో మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి.

Tags

Read MoreRead Less
Next Story