Tamil Nadu : బస్సును ఢీకొన్న కారు…ఏడుగురి మృతి

Tamil Nadu : బస్సును ఢీకొన్న కారు…ఏడుగురి మృతి
దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఘటన

తమిళనాడు రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడులో ప్రభుత్వ బస్సును కారు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. సోమవారం రాత్రి టాటా సుమో కారు బెంగళూరు వెళుతుండగా, తిరువణ్ణామలై అంధనూర్ బైపాస్ సమీపంలో బస్సును ఢీకొంది. 11 మందితో ప్రయాణిస్తున్న టాటా సుమో తిరువణ్ణామలై నుంచి బెంగళూరుకు వెళ్తుండగా సెంగం సమీపంలో ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది.

కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ సెంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సెంగం పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ కొనసాగుతున్నందున ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.


పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిరువణ్ణామలైలో జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. టాటా సుమో తిరువణ్ణామలై నుంచి బెంగళూరు వెళుతుండగా, బస్ ధర్మపురి నుంచి తిరువణ్ణామలై వైపుగా వెళుతోంది. ఈ రెండు వాహనాలు అంతనూర్ వద్ద ఢీకొన్నాయి. టాటా సుమోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు, బస్సులో వెళుతున్న వారిలో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టాటా సుమోలో ప్రయాణిస్తున్న వారిలో కొంత మంది స్వస్థలం అసోం అని.. వృత్తిరీత్యా బెంగళూరులో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. టాటా సుమోలో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.

ఘటనపై సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలింస్తుండగానే మార్గ మధ్యలోనే చనిపోయాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక 5 గురుఘటనాస్థలిలోనే చనిపోయారుని పోలీసులు తెలిపారు.

అసోంకు చెందిన పంచ రాయ్, నారాయణన్, విమల్, సాల్, నిఖాల్.. తమిళనాడుకు చెందిన కామరాజు, పునీత్ కుమార్(23) ఘటనలో మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు తమిళనాడు వాసులు, అసోంకు చెందిన సుబ్బన్న, కృష్ణప్ప, మిసోన్ మిర్మి, రాబన్ గురా తిరువణ్ణామలై మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు వారు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story