కృతజ్ఞతలు తెలిపే సమయం.. కార్మికులను కాపాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: ఆనంద్ మహీంద్రా

కృతజ్ఞతలు తెలిపే సమయం.. కార్మికులను కాపాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: ఆనంద్ మహీంద్రా
ఇది కృతజ్ఞతలు తెలియజేసే సమయం. 41 మంది విలువైన ప్రాణాలను కాపాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా Xలో పోస్ట్ చేశారు.

ఇది కృతజ్ఞతలు తెలియజేసే సమయం. 41 మంది విలువైన ప్రాణాలను కాపాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా Xలో పోస్ట్ చేశారు.

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో గత 17 రోజులుగా చిక్కుకున్న మొత్తం 41 మంది కూలీలను రక్షించారు. నిన్న సాయంత్రం ర్యాట్ హోల్ మైనర్‌లను మోహరించి చివరి ఘట్టన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ క్రమంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. “ ఇది కృతజ్ఞతలు తెలియజేయడానికి సమయం. ఈ 41 విలువైన ప్రాణాలను కాపాడేందుకు గత 17 రోజులుగా అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ క్రీడా విజయం కంటే ఇది తక్కువ కాదు. మీరు దేశం యొక్క నైతిక స్థైర్యాన్ని పెంచారు. ఏదైనా సొరంగం నుండి బయటపడటం కష్టం కాదని, మన చర్యలు, ప్రయత్నాలు సరిగ్గా ఉన్నప్పుడు ఏ పని అసాధ్యం కాదని మీరు గుర్తు చేశారు. "ప్రార్థనలు సహకరిస్తాయి" అని పేర్కొన్నారు.

పోస్ట్‌ను షేర్ చేసిన తర్వాత, వినియోగదారుల నుండి ఆన్‌లైన్‌లో చాలా స్పందనలు వస్తున్నాయి. ఒక వినియోగదారు ఇలా అన్నారు, “చాలా బాగా చెప్పారు సార్, ఇందులో పాల్గొన్న వారందరికీ సెల్యూట్. మీరు అద్భుతమైన పని చేసారు. ” మరొకరు ఇలా అన్నారు, “41 మంది ఉద్యోగులు, 17 రోజులు, బిలియన్ల కొద్దీ ప్రార్థనలు… సొరంగం నుండి సురక్షితంగా బయటపడ్డ కార్మికుల ముఖాల్లో చిరునవ్వులు చూడడం చాలా గొప్పగా అనిపించింది. ఇంకెప్పుడు ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అమాయకపు ప్రాణాలు టన్నెల్ నుంచి ఎప్పుడు బయటపడతారు అని వేచివుండుట పూర్తిఅయింది! దేవుడు గొప్పవాడు, భారతదేశం గొప్పది అని రాసుకొచ్చారు. మరొక నెటిజన్ “ఈ వార్త ఉపశమనం అందించింది. రెస్క్యూ వర్కర్ల కృషికి, శ్రమకు వందనాలు అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story