Tamil Nadu: లోయలో పడిన టూరిస్టు బస్సు, 8 మంది మృతి

Tamil Nadu: లోయలో పడిన టూరిస్టు బస్సు, 8 మంది మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం..

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటి దగ్గర కూనూర్‌లోని మరపాలెం సమీపంలో టూరిస్ట్ బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 35 మందికి గాయాలయ్యాయి. నీలగిరి జిల్లా కూనూరు-మేటుపాళ్యం జాతీయ రహదారి పక్కనే ఉన్న 50 అడుగుల లోతున్న లోయలో బస్సు పడింది. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు ఊటీ నుంచి మెట్టుపాళయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కూనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఊటికి వెళ్లి తెన్ కాశికి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


ఈ ఘటనకు సంబంధించి కోయంబత్తూరు జోన్ డీఐజీ శరవణ సుందర్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది మృతి చెందగా, మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. ఘటనాస్థంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొంతమందిని రక్షించి చికిత్స కోసం కూనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story