CWC2023: భారత జట్టును ఎవడ్రా ఆపేది

CWC2023: భారత జట్టును ఎవడ్రా ఆపేది
ప్రపంచకప్‌లో వరుసగా తొమ్మిదో విజయం... నెదర్సాండ్స్‌ను చిత్తు చేసిన టీమిండియా

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన ఆరంభం నుంచే దూకుడు మంత్రాన్ని జపించింది. శ్రేయస్స్‌ అయ్యర్‌ 94 బంతుల్లో 10 ఫోర్లు అయిదు సిక్సులతో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు చివరి ఓవర్‌లో రెండు భారీ సిక్సులతో రాహుల్‌ కూడా సెంచరీ చేశాడు. రాహుల్‌ కేవలం 62 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీని అందుకున్నాడు. 102 పరుగుల వద్ద రాహుల్ వెనుదిరిగాడు. అయ్యర్‌, రాహుల్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో చివరి 10 ఓవర్లలో టీమిండియా 126 పరుగులు రాబట్టింది.


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-గిల్‌ భారత్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. 11.5 ఓవర్లలోనే వంద పరుగులు జోడించిన టీమిండియా ఓపెనర్లు భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. సరిగ్గా వంద పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్‌ 61 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్‌ అవుటైన తర్వాత ధాటిగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసిన గిల్‌ 51 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం కోహ్లీ, శ్రేయస్స్ అయర్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సరిగ్గా స్కోరు 200 పరుగులు చేరాక 51 పరుగులు చేసిన విరాట్ వెనుదిరిగాడు. అనంతరం రాహుల్‌తో జత కలిసిన శ్రేయస్స్‌ అయ్యర్ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. అయ్యర్‌ 94 బంతుల్లో 10 ఫోర్లు అయిదు సిక్సులతో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్‌ కేవలం 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీని అందుకున్నాడు. 102 పరుగుల వద్ద రాహుల్ వెనుదిరిగాడు. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.


411 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 47.5 ఓవర్లలో250 పరుగులకు ఆలౌట్‌ అయింది. తేజ 54, ఎంగ్రెల్‌ బ్రెచ్‌ 45, ఆకర్‌మన్‌ 35, మాక్స్‌ ఓ డౌడ్‌ 30 పరుగులతో రాణించడంతో నెదర్లాండ్స్‌ 200 పరుగుల మైలురాయిని దాటింది. అ తర్వాత వికెట్లు పడకపోయినా పరుగులు రావడం మందగించింది. దీంతో 47.5 ఓవర్లలో250 పరుగులకు నెదర్సాండ్‌ ఆలౌట్‌ అయింది. దీంతో 160 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. భారత బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్‌ 2, కుల్‌దీప్ 2, జడేజా రెండు వికెట్లు తీశారు.

Tags

Read MoreRead Less
Next Story