MS Dhoni : ధోనీ టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కత్రినా కైఫ్

MS Dhoni : ధోనీ టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్  గా  కత్రినా కైఫ్

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. మార్చి నుంచి మే వరకూ ఐపీఎల్ హంగామా జరగనుంది. దీంతో చాలా టీంలు అంబాసిడర్ లను నియమించుకుంటున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా వారి టీంకి బ్రాండ్ అంబాసిడర్ ను నియమించుకుంది. అందుకు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ని ఎంచుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో కత్రినాతో యాడ్ షూట్ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. త్వర లోనే చెన్నై ఆటగాళ్లతో కత్రినా యాడ్ షూట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఇన్నో వేటివ్ డిజైన్ తో ఈ యాడ్ రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఈ ఐపీఎల్ ధోనికి చివరిది కావడంతో స్పెషల్ గా నిలిచేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నరట. కాగా ఇప్పటివరకూ చెన్నై టీమ్ కి సెలబ్రిటీలు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించలేదు. దీంతో ఈసారి సీఎస్ కేనుంచి చాలా స్పెషల్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కత్రినా కైఫ్ ఇప్పటికే విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. కాగా కత్రినా నటించిన మెరీ క్రిస్మస్ రీసెంట్ గానే విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్చి 23 నుంచి మే 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్టు 74 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. అందుబాటులో ఉన్న ప్లేయర్లు ప్రాంచైజీల పర్యవేక్షలో ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story