Rishabh Pant: చల్ల గాలిని ఆస్వాదిస్తున్నా.. దేవునికి ధన్యవాదాలు: రిషబ్ పంత్

Rishabh Pant: చల్ల గాలిని ఆస్వాదిస్తున్నా.. దేవునికి ధన్యవాదాలు: రిషబ్ పంత్
Rishabh Pant: రిషబ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన హెల్త్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు, తాజా గాలిని ఆస్వాదిస్తున్నానని దేవునికి ధన్యవాదాలు తెలిపాడు.

Rishab Panth: రిషబ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన హెల్త్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు, తాజా గాలిని ఆస్వాదిస్తున్నానని దేవునికి ధన్యవాదాలు తెలిపాడు.

పంత్ చివరిసారిగా డిసెంబర్ 22న బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారతదేశం తరపున ఆడాడు, దీనిలో మెన్ ఇన్ బ్లూ 2-0 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది, ఈ సంవత్సరం చివరిలో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు పోటీలో నిలిచింది.

ఇన్ని రోజులు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను.. ఇప్పుడు బయట కూర్చుని స్వచ్ఛమైన గాలిని పీల్చడం చాలా ఆనందంగా ఉంది. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదంగా అనిపిస్తుంది" అని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

డిసెంబరు 30, ఉదయం 5:30 గంటల ప్రాంతంలో, ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై అతని కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని మంటలు చెలరేగడంతో పంత్ కి గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి తన స్వగ్రామం రూర్కీకి కారులో వెళ్తుండగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా మంగ్లౌర్ మరియు నర్సన్ మధ్య ఘోర కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. క్రికెట్ కు కొంత కాలం విరామం ఇవ్వక తప్పని పరిస్థితి. పూర్తిగా కోలుకున్నాక పిచ్ లోకి అడుగుపెడతాడు.

Tags

Read MoreRead Less
Next Story