Telangana: ఇద్దరినీ ప్రేమించాడు.. ఒకే వేదికపై ఇరువురి మెడలో మూడుముళ్లు

Telangana: ఇద్దరినీ ప్రేమించాడు.. ఒకే వేదికపై ఇరువురి మెడలో మూడుముళ్లు
Telangana: వరుసకు ఇద్దరు వధువులు దగ్గరి బంధువులే.. ఇద్దరితో ప్రేమాయణం సాగించాడు.

Telangana: వరుసకు ఇద్దరు వధువులు దగ్గరి బంధువులే.. ఇద్దరితో ప్రేమాయణం సాగించాడు. పెళ్లికి ముందే ఇద్దరితో పిల్లలను కూడా కన్నాడు.. ఇప్పుడు ఒకే వేదికపై ఇద్దరమ్మాయిల మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే ముద్రించిన శుభలేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడేళ్ల కిందటే ఇద్దరినీ చూసి ముచ్చటపడ్డాడు. ఇరువురితో సంసారం చేస్తున్నాడు. గిరిజన సంప్రదాయం ప్రకారం గురువారి వారి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు.

చర్ల మండలం మారుమూల ఎర్రబోరుకు చెందిన మడివి సత్తిబాబు డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇంటర్‌ చదువుతున్నప్పుడే అదే ప్రాంతానికి చెందిన స్వప్న కుమారిని ప్రేమించాడు. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్న సమయంలోనే సత్తిబాబు వరుసకు మరదలైన సునీతపైన కూడా మనసు పారేసుకున్నాడు. ఆమె కూడా ఇతడిని ఇష్టపడింది. దాంతో ఇద్దరితో సహజీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్వప్నకు పాప, సునీతకు బాబు పుట్టారు. అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని కోరగా ఇరువురినీ ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని అన్నాడు. మూడు గ్రామాల పంచాయితీ పెద్దలు మాట్లాడుకుని పెళ్లికి ఒప్పుకున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం యువతీ యువకులు ఇష్టపడితే ముందుగా ఇంటికి తెచ్చుకుంటారు. వారితో సహజీవనం సాగిస్తారు. ముగ్గురి ఇష్టప్రకారమే ఈ పెళ్లి జరుగుతోందని గ్రామస్థులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story