Godavarikhani: నిత్య పెళ్లి కూతురి బండారం బట్టబయలు

Godavarikhani: నిత్య పెళ్లి కూతురి బండారం బట్టబయలు
వరంగల్ జిల్లాకు చెందిన మెండే అనూష పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మోసానికి పాల్పడుతోంది.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిత్య పెళ్లి కూతురు వ్యవహారం బయటికి వచ్చింది. వరంగల్ జిల్లాకు చెందిన మెండే అనూష పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మోసానికి పాల్పడుతోంది. ఇప్పటికే 13 మందికి టోకరా ఇచ్చి అందులో నలుగురి పెళ్లి చేసుకున్నట్లు ఆలస్యంగా బయటికి వచ్చింది. మ్యాట్రిమోనీ ద్వారా యువకులకు గాలం వేసి వారిని మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన సుద్దాల రేవంత్ మొదటి భార్యతో విడాకులు తీసుకొని రెండవ పెళ్లి కోసం షాదీ డాట్ కామ్ లో అప్ లోడ్ చేశారు. తన ప్రొఫైల్ పై స్పందించిన అనూష పెద్దల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. రెండు నెలలు పాటు తమ వైవాహిక జీవితం సజావుగా సాగిందని, ఆ తర్వాత అనుష తన విశ్వరూపాన్ని బయట పెట్టినట్లు వెల్లడించారు.

ఆమెకు మద్యం, సిగరెట్ అలవాటు ఉందని రోజు ఇప్పించాలంటూ గొడవ చేసేదన్నారు. నిత్యం వేధింపులకు గురి చేస్తూ గొడవలు పెట్టుకునేదన్నాడు రేవంత్. ఇటీవల బంధువుల ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి నాలుగు తులాల బంగారం, 70 వేల నగదు తీసుకెళ్లినట్లు తెలిపాడు.కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్ కు పిలిచి తన స్నేహితులతో గదిలో బంధించి కొట్టినట్లు వెల్లడించారు. పది లక్షలు ఇవ్వాలని లేకపోతే పర్సనల్ వీడియోలను బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతుండటంతో పోలీసులను ఆశ్రయించాడు. అనూష నుంచి తనకు ప్రాణభయం ఉందని న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు

Tags

Read MoreRead Less
Next Story