Peddapalli: పిల్లిని కాపాడబోయి.. ప్రాణం కోల్పోయి..

Peddapalli: పిల్లిని కాపాడబోయి.. ప్రాణం కోల్పోయి..
Peddapalli: పెంచుకున్న పిల్లి బావిలో పడింది. దాన్ని పైకి లాగే ప్రయత్నంలో పట్టు తప్పి బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది ఓ మహిళ.

Peddapalli: పెంచుకున్న పిల్లి బావిలో పడింది. దాన్ని పైకి లాగే ప్రయత్నంలో పట్టు తప్పి బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది ఓ మహిళ. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం కిష్టంపల్లెలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని లింగాల లసుము (55) ఇంట్లోని పెంపుడు పిల్లి.. తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని బావిలో పడింది. గమనించిన లసుము బొక్కెనతో పిల్లిని బయటకు తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె పట్టుతప్పి బావిలో పడింది. గమనించిన చిన్న కుమారుడు హుటాహుటిన స్థానికుల సహాయంతో తల్లిని పైకి తీశాడు. కానీ ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story