Telangana: ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు వెళ్తుండగా ఘోర ప్రమాదం..

Telangana: ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు వెళ్తుండగా ఘోర ప్రమాదం..
Telangana: మనం ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలుస్తుంది. పెళ్లి వేడుకకు ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది.

Telangana: మనం ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలుస్తుంది. పెళ్లి వేడుకకు ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. కానీ ఇప్పుడు అదే వారి జీవితాలను బలితీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు ముందు గం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.




కారు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని, మరొకరు ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్, శివ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వ్యక్తిని రణధీర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వీరంతా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళుతున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story