టీఆర్ఎస్, ఎంఐఎంలపై బండి సంజయ్ మరోసారి విమర్శలు

టీఆర్ఎస్, ఎంఐఎంలపై బండి సంజయ్ మరోసారి విమర్శలు
గ్రేటర్ ఎన్నికలకు ముందు శత్రువులు లాగా నటించిన రెండు పార్టీలు.. ఎన్నికల తర్వాత కలిసిపోయాయని సంజయ్ విమర్శలు

టీఆర్ఎస్, ఎంఐఎంలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు శత్రువులు లాగా నటించిన రెండు పార్టీలు.. ఎన్నికల తర్వాత కలిసిపోయాయని ఆరోపించారు. దేశంలోని 80శాతం హిందువుల రక్షణ కోసం బీజేపీ పాటుపడుతుందని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న సంజయ్.. ధన్వద మండలం అప్పంపల్లి గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్ కు అక్కడి బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.


Tags

Read MoreRead Less
Next Story