Bandi Sanjay letter to KCR: బండి సంజయ్ రాసిన లేఖలో ఏముంది?

Bandi Sanjay letter to KCR: బండి సంజయ్ రాసిన లేఖలో ఏముంది?
Bandi Sanjay letter to KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.

Bandi Sanjay letter to KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తారు అంటూ ప్రశ్నించారు. 2014తోపాటు, 2018 మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ అనేక హామీలు ఇచ్చిందని, వాటిపై చర్చకు సిద్ధమా చెప్పాలన్నారు. ఈ ఏడున్నరేళ్లలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించారు? ఎన్ని పేదలకు ఇచ్చారు? వీటికి లెక్కలు చెప్పాలన్నారు. 2018 ఎన్నికల్లో సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి..

5 నుంచి 6 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని ఒక్కరికైనా ఇచ్చారా, ఇస్తే వివరాలు ఇవ్వాలన్నారు. అలాగే కేంద్రం రాష్ట్రానికి 2 లక్షల 91 వేల ఇండ్లను మంజూరు చేస్తే ఎన్ని పూర్తి చేశారని కూడా ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణం పూర్తిచేస్తే.. అదనంగా మరో 10 లక్షల ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత తెలంగాణ బీజేపీదేనని సంజయ్ చెప్పారు. డబుల్ బెడ్ ఇళ్లకు ఇప్పటివరకూ బడ్జెట్‌లో కేటాయించింది ఎంత, ఖర్చు చేసింది ఎంతో కూడా చెప్పాల్సిన బాధ్యత టీఆర్‌దేనన్నారు బండి సంజయ్.

Tags

Read MoreRead Less
Next Story