తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావుకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసిన హైకోర్టు

తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావుకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసిన హైకోర్టు

తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావుకు హైకోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని శ్రీనివాస్ రావును ఆదేశించింది. రోజుకు 50వేలు, వారానికోసారి లక్ష కరోనా పరీక్షలు చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఐతే.. రోజుకు 50 వేల పరీక్షలు అవసరం ఉన్నప్పుడు చేస్తామని శ్రీనివాస రావు నివేదికలో పేర్కొన్నారు. రోజుకు 50 వేలు, వారానికో రోజు లక్ష కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాజకీయ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలంది. జీఎచ్ఎంసీలో మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా జాగ్రత్తలకు సంబంధించిన జీవో 64 అమలు బాధ్యత.. జీహీచ్ఎంసీకి అప్పగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఆ బాధ్యత పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. అటు.. ప్రైవేట్ ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంది. కరోనా మరణాలపై ఆడిట్ కమిటీ ఏర్పాటును పరిశీలించాలని.. కరోనా బాధితులకు ధైర్యం కలిగించేలా మానసిక కేంద్రం ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. డిసెంబరు 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేసింది.


Tags

Read MoreRead Less
Next Story