తెలంగాణలో కొత్తగా 2,751 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,751 కరోనా కేసులు
తెలంగాణలో గతవారం రోజుల నుంచి మళ్లీ పుంజుకుంటుంది. గడిచిన 24 గంటల్లో 2,751 మంది కరోనా బారినపడ్డారు.

తెలంగాణలో గతవారం రోజుల నుంచి మళ్లీ పుంజుకుంటుంది. గడిచిన 24 గంటల్లో 2,751 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,166కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్ బారినపడి కొత్తగా 9 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 808కి చేరుకుంది. తెలంగాణలో ఇప్పటి వరకు 89,350 మంది డిశ్చార్జి అవ్వగా.. ఇంకా 30,008 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.67శాతంగా, రికవరీ రేటు 74.3శాతంగా నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story