Crime: రంగారెడ్డి జిల్లాలో దారుణహత్య
By - Subba Reddy |4 March 2023 7:45 AM GMT
ఫాంహౌస్ లో పనిచేస్తున్న మహిళను కిరాతకంగా పొడిచి చంపిన దుండగులు
రంగారెడ్డి జిల్లాలో దారుణహత్య జరిగింది. కందుకూరు మండలం దసర్లపల్లి శివారులో ఉన్న ఓ ఫాంహౌస్లో జరిగిన ఈ హత్య కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన బిల్డర్ మధుకు చెందిన ఫాంహౌస్లో కేర్ టేకర్లుగా పనిచేస్తున్నారు నెల్లూరుకి చెందిన నరేందర్, శైలజ. గత పదేళ్లగా ఇదే ఫాంహౌస్ లో పనిచేస్తున్నారు. వీకెండ్ కావడంతో ఓనర్ మధు ఫాంహౌస్కు వచ్చాడు. అతనితో మాట్లాడేందుకు వెళ్లిన నరేందర్కు కుక్కలు అదే పనిగా ఆరవడం వినిపించింది. అక్కడికి వెళ్లి చూడడంతో రక్తపు మడుగులో ఉన్న శైలజ కనిపించింది. ఆమె వీపుపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com