గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్‌

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్‌

గ్రేటర్‌లో ఫ్లెక్సీ వార్‌ నడుస్తోంది.. చేసిన అభివృద్ధిని వివరిస్తూ టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు.. నగరంలో ప్రభుత్వ ఆస్తులు, పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌పై టీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లెక్సీలను చించేయాలంటూ పార్టీ శ్రేణులకు బండి సంజయ్‌ పిలుపునివ్వడం కలకలం రేపుతోంది.. ఇప్పటికే టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా తాజాగా ఇది ఫ్లెక్సీల వరకు వెళ్లింది.. గ్రేటర్‌లో ప్రచారం నిర్వహించుకునే, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే హక్కు అన్ని పార్టీలకూ ఉందని, టెండర్లు పిలవకుండా టీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేస్తోందంటూ అరవింద్‌ మండిపడ్డారు.


Tags

Read MoreRead Less
Next Story