ఆ పార్టీలకు డిపాజిట్లు వస్తాయా లేదా ఈ ఎన్నికల్లో తేలుతుంది :హరీష్ రావు
Harish Rao (File Photo)
By - Nagesh Swarna |18 Sep 2020 3:04 PM GMT
దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్షమెజార్టీతో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు వస్తాయా.. లేదా అనేది ఈ దుబ్బాక ఉప ఎన్నికల్లో తేలనుందన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గెస్టు హౌజ్, అంబులెన్స్ను మంత్రి ప్రారంభించారు. ఇన్నాళ్ల కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు ఇవ్వలేక పోయాయని, ఆరు ఏళ్లలో టీఆర్ ఎస్ ప్రభుత్వం తాగునీరు, సాగునీరు అందించిందన్నారు. దుబ్బాకపై ప్రేమతో మున్సిపాలిటీ అభివృద్దికి 35 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com