Janagam: ఆర్థిక గొడవలు.. ఎస్సై దంపతుల ఆత్మహత్య..

Janagam: ఆర్థిక గొడవలు.. ఎస్సై దంపతుల ఆత్మహత్య..
Janagam: ఎస్సై దంపతులు అర్థరాత్రి గొడవ పడ్డారు.. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబసంబంధాలు వారికి నిద్రపట్టకుండా చేసాయి.

Janagam: ఎస్సై దంపతులు అర్థరాత్రి గొడవ పడ్డారు.. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబసంబంధాలు వారికి నిద్రపట్టకుండా చేసాయి. దీంతో భార్య తెల్లవారు జామున బాత్రూమ్‌కు వెళ్లి కిటికీకి చున్నీ బిగించి ఉరి వేసుకుంది. భర్త రివాల్వర్‌తో కాల్చుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద సంఘటన జనగామలో చోటు చేసుకుంది.

జనగామ ఎస్సై కాసర్ల శ్రీనివాస్ గత ఎనిమిదేళ్లుగా పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. భార్యాభర్తలు జనగామలో ఉంటున్నారు. బుధవారం రాత్రి ఇద్దరిమధ్యా కుటుంబ, ఆర్థిక సంబంధిత విషయాలపై గొడవ జరిగింది.

దీంతో గురువారం తెల్లవారుజామున ఆయన భార్య స్వరూప బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని మరణించారు. ఉదయం నిద్రలేచిన శ్రీనివాస్ బాత్‌రూమ్‌కి వెళ్లి చూడగా భార్య విగతజీవిగా కనిపించారు. విషయం తెలుసుకున్న స్నేహితులు, బంధువులు ఇంటికి వచ్చి ఎస్సైని పరామర్శించారు.

అనంతరం ఏసీపీ దేవేందర్ రెడ్డి, పట్టణ ఇన్‌ఛార్జ్ సీఐ నాగబాబు ఎస్సై నివాసానికి చేరుకుని భార్య మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి వరకు బెడ్‌రూమ్‌లో ఉన్న ఎస్సై వాష్‌రూమ్‌కి అని చెప్పి లోపలికి వెళ్లి ఒక్కసారిగా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. కాల్పుల శబ్ధం విని అప్పటికే ఇంట్లో ఉన్న ఏసీపీ, సీఐ బాత్‌రూమ్‌కి వెళ్లి చూడగా, ఎస్సై కుప్ప కూలి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story