Kaleswaram: రెండో పంప్‌ ట్రయల్‌ రన్ సక్సెస్‌

Kaleswaram: రెండో పంప్‌ ట్రయల్‌ రన్ సక్సెస్‌
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్కపేట జలాశయం రెండో పంప్‌ ట్రయల్‌ రన్ సక్సెస్‌ అయ్యింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్కపేట జలాశయం రెండో పంప్‌ ట్రయల్‌ రన్ సక్సెస్‌ అయ్యింది. ఉదయం ఇరిగేషన్ ఇంజినీర్లు ఈ ట్రయల్‌ రన్ నిర్వహించారు. దాదాపు గంటపాటు నిరంతరాయంగా ట్రయల్‌ చేపట్టినట్లు సమాచారం. ప్యాకేజీ-9 ఈఈ గంగం శ్రీనివాస్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. ట్రయల్‌ రన్ జరుగుతున్న తీరును కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. రెండో పంపు ట్రయల్ రన్‌ సక్సెస్‌ కావడంతో మంత్రి కేటీఆర్‌, జల్లా కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇక కోనరావుపేట మండలం మల్కపేట వద్ద నిర్మించిన ఈ రిజర్వాయర్‌ను త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story