KCR: బీజేపీ రాజ‌కీయ స్వార్థాల‌కు బ‌లికావద్దు- కేసీఆర్‌

KCR: బీజేపీ రాజ‌కీయ స్వార్థాల‌కు బ‌లికావద్దు- కేసీఆర్‌
KCR: వికారాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌.. బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

KCR: వికారాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌.. బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే.. శఠగోపం తప్పదని హెచ్చరించారు. ఆ జెండాను పట్టుకుంటే మళ్లీ పాతకథే వస్తుందన్నారు.

తెలంగాణ ప్రజ‌లు మోస‌పోతే గోస‌ప‌డే ప‌రిస్థితులు వ‌స్తాయని, వ‌చ్చిన తెలంగాణ‌ను మ‌ళ్లీ గుంట‌న‌క్కలు వ‌చ్చి పీక్కొని తిన‌కుండా, పాత ప‌ద్దతికి మ‌ళ్లీ పోకుండా, మ‌ళ్లీ ప‌రిస్థితులు దిగ‌జార‌కుండా, వారి రాజ‌కీయ స్వార్థాల‌కు బ‌లికాకుండా ఈ తెలంగాణ‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అంతకుముందు వికారాబాద్‌ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నూతన కలెక్టరేట్‌ కాంఫ్లెక్స్‌ను ప్రారంభించిన కేసీఆర్‌... మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేశారు. అలాగే టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story