KTR: నేను చెప్పేది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్
KTR: హనుమకొండ బహిరంగ సభ వేదికగా బీజేపీపై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. కేంద్రంలోని మోదీ సర్కార్...తెలంగాణకు చేసేంది ఏమీలేదని ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేటాయింపుల్లో గుండుసున్నా చూపించారని ఆయన ధ్వజమెత్తారు. మోదీ పైసలతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని BJP నేతలు మాట్లాడుతున్నారన్న కేటీఆర్...రాష్ట్రం నుంచి కేంద్రానికి 3 లక్షల 65 వేల 797 కోట్లు ఇచ్చామని తెలిపారు.
తిరిగి తెలంగాణకు కేంద్రం ఇచ్చింది లక్షా 68వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారో బీజేపీ నాయకులు తెలుసుకోవాలన్నారు కేటీఆర్. తాను చెప్పింది తప్పయితే రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా..మంత్రి పదవిని తీసి ఎడమకాలి చెప్పులా పడేస్తానని సవాల్ చేశారు. చెప్పిన లెక్క తప్పితే మంత్రి పదవిని వదిలి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతాన్నారు. దమ్ముంటే తాను చెప్పింది తప్పని బీజేపీ నాయకులు రుజువు చేయాలని సవాల్ విసిరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com