జానారెడ్డిని కలిసిన ఠాక్రే
By - Bhoopathi |24 Jun 2023 1:45 PM GMT
పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావ్. పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జానారెడ్డిని ఠాక్రే కలవడంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఉత్తమ్ ఇంటికి వెళ్లారు మహేశ్ కుమార్ గౌడ్. అటు.. జగ్గారెడ్డితో ఠాక్రే ఫోన్లో మాట్లాడారు. పార్టీ మారేది లేదని ఉత్తమ్, జగ్గారెడ్డి.. ఠాక్రేకు చెప్పినట్లు తెలుస్తోంది. మానసికంగా దెబ్బ తీస్తున్నారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటానని.. స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com