Nizamabad: కారుపై పడ్డ జేసీబీ.. ముగ్గురు మృతి
By - Subba Reddy |29 March 2023 6:15 AM GMT
భీంగల్ జూనియర్ కాలేజ్ వద్ద ట్రాక్టర్ పై జేసీబీ తీసుకెళ్తుండగా, వెనక నుంచి వస్తున్న కారుపై జారి పడ్డ జేసీబీ...
నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీంగల్ జూనియర్ కాలేజ్ వద్ద ట్రాక్టర్ పై జేసీబీ తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే వెనక నుంచి వస్తున్న కారుపై అది పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్నవారు బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తునట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వీళ్లంతా మెర్తాడ్కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com