Mahabubabad:గుడిసెలు పీకేసిన అధికారులు

Mahabubabad:గుడిసెలు పీకేసిన అధికారులు

మహబూబాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. కొత్త కలెక్టరేట్‌ సమీపంలోని సర్వే నంబర్ 255/1లోని ప్రభుత్వ భూముల్లో వెలసిన గుడిసెలను అధికారులు తొలగిస్తున్నారు. జేసీబీలతో గుడిసెలు కూల్చివేస్తుండగా స్థానికులు అడ్డుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో బాధితులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అధికారులు వెళ్లిపోవాలని గుడిసెవాసులు నినాదాలు చేస్తున్నారు. పోలీసుల సాయంతో అధికారులు గుడిసెల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story