రాష్ట్రంలో ఉంది రైతు ప్రభుత్వం: కేటీఆర్

రాష్ట్రంలో ఉంది రైతు ప్రభుత్వం: కేటీఆర్

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ కష్ట కాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు.

రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు.. ఈ మధ్యనే కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్న కేటీఆర్‌.. రైతులు ధైర్యం కోల్పోవద్దని చెప్పారు.. రైతులకు అండగా కేసీఆర్‌ వున్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.. రానున్న ఒకట్రెండ్రోజులపాటు భారీ వర్షసూచన నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికార యంత్రాంగానికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

అకాల వర్షాలు కారణంగా పంటలను నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మజిల్లా ముదిగొండలో పర్యటించిన ఆయన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆయన పర్యటించారు. పంటలు నష్టపోయిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఏమేరకు పంటలు నష్టపోయాయో అంచనా వేసి, అనంతరం నష్టాపరిహారాన్ని అందజేయలని సీఎందృష్టికి తీసుకెళ్లతామన్నారు. అనంతరం ఆయన దీపికల నిరవాదిక సమ్మెకు మద్దతు తెలిపారు.

Next Story